loader

నంద్యాల జిల్లా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఉప్పు-నిప్పులా ఉన్న భూమా అఖిలప్రియ( ఏవీ సుబ్బారెడ్డి (AV Subbareddy)ఫ్యామిలీల మధ్య వ్యక్తిగత విభేదాలు ..ఇప్పుడు పార్టీ మెడకు చుట్టుకున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్( Naralokesh)యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతున్న సమయంలో ఇరువర్గాల మధ్య ఉన్న పగలు, ప్రతీకారాలు భగ్గుమన్నాయి. దాంతో మంగళవారం ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయులు దాడి చేశారు. ఈ వివాదం పరస్పరం దాడులు చేసుకోవడం, రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై సవాళ్లు విసురుకోవడం వరకు వచ్చింది. మాజీ మంత్రి అఖిలప్రియ తన తండ్రి పట్ల వ్యవహరించిన తీరు, దాడిని ఖండిస్తూ ఆమెకు వార్నింగ్ ఇస్తూ ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జ‌స్వంతిరెడ్డి (Jaswanthi Reddy) ఓ వీడియో రిలీజ్ చేసింది.

© Copyright 2022 Newz Blog. All Right Reserved