ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ఆశాదీపంగా మారినట్లుగా కనిపిస్తోంది. వారాహియాత్ర చేస్తున్న ఆయన ఢిల్లీ పర్యటనతో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో పొత్తులపై అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.హస్తినలో బీజేపీ పెద్దలతో వరుసగా సమావేశం అయ్యారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి, పార్టీ కీలకనేత అమిత్షాతో భేటీ అయ్యారు జనసేనాని. సుమారు 20నిమిషాలకుపైగా వీరిద్దరు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది
- 0 Comments
- nellore