loader

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంక్రాంతి సెలవుల్ని ప్రకటించడంతో మళ్లీ హాలిడే సీజన్ మొదలైంది. అరకు వెళ్లాలనుకునేవారికి రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అదనంగా అద్దాల బోగీలు అందుబాటులోకి తీసుకొచ్చింది.
పచ్చని వాతావరణం, వలస పువ్వుల ఆహ్వానం, చల్లటి మంచు తెరలు అరకు సొంతం. డిసెంబర్, జనవరి వచ్చిందంటే అరకు వెళ్లే పర్యటకులు అధిక శాతం ఉంటారు. రైలు మార్గం ద్వారా అద్దాల రైలు ఉండడంతో అధిక శాతం పర్యటకులు ఈ రైల్లో ప్రయాణం చేయడం జరుగుతుంది.అద్దాల బోగీ మరొకటి జతపరిస్తే పర్యాటకులు ఎక్కువ వెళ్లేందుకు అవకాశం ఉంటుందని అధికారులు మరొక అద్దాలబోగి ఏర్పాటు చేయడం జరిగింది. వాల్తేర్ డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం టు కిరండూల్ రైలుకు అదనపు కోచ్లు జత చేసినట్లు రైల్వే అధికార్లు ప్రకటించారు.

© Copyright 2022 Newz Blog. All Right Reserved