loader

ఏపీ అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ 2023-24 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. అలాగే స్పీకర్ పోడియంపై టీడీపీ ఎమ్మెల్యేలు పేపర్లు విసిరారు
దీనితో టీడీపీ సభ్యులపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్ కు సీఎం సిఫార్సు చేశారు. ఈ క్రమంలో 14 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ ఒక్కరోజు సస్పెండ్ చేశారు.
బడ్జెట్ ప్రవేశపెడుతుంటే కావాలనే టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారని..బడ్జెట్ ప్రజలకు వినపడకుండా చేయడం సరికాదని సీఎం జగన్ అన్నారు. టీడీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి పంపించి ఆ తరువాత బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని అన్నారు.బడ్జెట్ ప్రవేశపెడుతుంటే ఆందోళన చేయడం ఏంటని స్పీకర్ ప్రశ్నించారు. ఆందోళన చేసిన టీడీపీ సభ్యులను ఒకరోజు సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తెలిపారు.

© Copyright 2022 Newz Blog. All Right Reserved