దేశ స్వాతంత్య్ర దినోత్సవరం ప్రతి యేటా ఆగస్టు 15న జరుపుకుంటారు. బ్రిటీషు దాస్య శృంఖలాల్ని తెంచుకున్న సందర్బంగా ఆనందంతో జరుపుకునే వేడుక. 2 శతాబ్దాల బ్రిటీషు పాలనకు చరమగీతం పలికిన చారిత్రక ప్రాధాన్యత కలిగింది. ఆగస్టు 15,1947. భారత దేశ తొలి ప్రధానిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సాక్షిగా జాతీయ జెండాను ఎగురవేసిన తొలి సందర్భం. భారతదేశం స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్న చారిత్రక సమయం.నిరంతర పోరాటం, అహింసా మార్గం, ఎందరో స్వాతంత్య్ర వీరులు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ తదితరుల త్యాగానికి ప్రతిఫలం లభించిన సందర్భం. స్వయం పాలన, సార్వ భౌమాధికారం,ప్రజాస్వామ్య పద్ధతిలో కొత్త శకానికి సంకేతంగా ప్రతి భారతీయుడు గుర్తుంచుకునే చారిత్రక అవసరం.