తన రాజకీయ ప్రస్థానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్. ఇప్పటికైతే తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ నంటూ తన పొలిటికల్ కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంంటెంట్స్ ఆఫ్ ఇండియా సదస్సుకు పవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ ..గెలుపైనా, ఓటమైనా రెండూ గమనాలే తప్ప గమ్యాలు కాదన్నారు. అనవసరంగా గెలుపోటములను అతిగా తలకు ఎక్కించుకోవద్దని సూచించారు. అప్పుడే అనుకున్న అసలు టార్గెట్ రీచ్ కాగలమంటూ విద్యార్థులను మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు.