Mann Ki Baat : ఆల్ ఇండియా రేడియోలో ఈ సంవత్సరం చివరి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజయవంతంగా పూర్తి చేశారు. 2014లో ఆయన ప్రధాని పీఠం ఎక్కిన తర్వాత జరిగిన 94వ ఎడిషన్ ఇది. ప్రతీ నెలా చివరి ఆదివారం నాడు ఆయన దేశ ప్రజలతో రేడియో ద్వారా.. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. తన అభిప్రాయాలను వారికి చెబుతున్నారు. నెలలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తున్నారు. ప్రతీ నెలా ఉదయం 11 గంటల నుంచి 12 మధ్య ఈ ప్రోగ్రామ్ జరుగుతోంది.ఈ కార్యక్రమానికి దేశ ప్రజలు నమో యాప్, మైగవ్ లేదా 1800-11-7800 నంబర్కి మెసేజ్ రూపంలో తమ అభిప్రాయాలు పంపాలని ప్రధాని మోదీ కోరుతున్నారు. దేశ ప్రజలు కూడా ఆ విధంగా తమ అభిప్రాయాలు ప్రధానితో పంచుకుంటున్నారు.