loader

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. 6 గంటలతో ముగిసింది. అయితే చివరి గంటలో పోలింగ్ పర్సంటేజ్ భారీగా పెరిగింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. అటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఇవాళే పోలింగ్ జరిగింది. ఏపీలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ నిర్వహించారు.
సమస్యాత్మక ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగిసింది.

© Copyright 2022 Newz Blog. All Right Reserved