ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా, భారీ పెట్టుబడులే లక్ష్యంగా అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిత్ 2023కి విశాఖ నగరం సర్వం సిద్ధమైంది.ఈ రోజుల్లో ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే బయటినుంచి పెట్టుబడులు రావాలి. అలా రాకపోతే.. కంపెనీలు రావు, ఉద్యోగాలు ఉండవు.. అన్నీ సమస్యలే.అందుకే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు పెట్టుబడులపై ఫోకస్ పెట్టింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2023పై చాలా ఆశలు పెట్టుకుంది. ప్రపంచ నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టింది.