ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించింది అధికార పార్టీ వైసీపీ. వైజాగ్ జిల్లా భీమునిపట్నంలో శనివారం నిర్వహించిన సిద్ధం బహిరంగ సభ ద్వారా ప్రజలకు తాము ఇచ్చిన వాగ్ధానాలు గడిచిన 53 నెలల కాలంలో అమలు చేసిన విషయాన్ని వెల్లడించారు వైసీపీ అధినేత,ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏపీలో జరగబోయే ఎన్నికలను కురక్షేత్ర యుద్ధంతో పోల్చారు జగన్.వైసీపీ నిర్వహించిన తొలి బహిరంగ సభ కావడంతో జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాబోయే ఎన్నికల్లో తాను కౌరవులతో యుద్ధం చేయబోతున్నానని ..అయితే టీడీపీ,జనసేన, కాంగ్రెస్, బీజేపీలు తనను ఓడించడానికి పద్మవ్యూహం పన్నుతున్నాయని