డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్లో ఆయన 125 అడుగుల కంచు విగ్రహాన్ని ఆవిష్కరించబోతోంది.పేదల పెన్నిధి, బడుగుల కోసం జీవితాంతం కృషి చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కంచు విగ్రహాన్ని ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించబోతున్నారు. ఇవాళ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం (ఏప్రిల్ 14) మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి మాజీ లోక్సభ ఎంపీ, అంబేద్కర్ మనవడైన ప్రకాశ్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా వస్తున్నారు.దేశంలోనే అతి పెద్ద కాంస్య విగ్రహం ఇదే. ఈ కార్యక్రమానికి ప్రజలంతా తరలి రావాలని ప్రభుత్వం పిలుపిచ్చింది. విగ్రహావిష్కరణ తర్వాత భారీ బహిరంగ సభను జరుపుతున్నారు.