కలియుగ వైకుంఠనాధుడు కొలువైయున్న తిరుమల పుణ్యక్షేత్రంకు ప్రతి నిత్యం దేశ విదేశాల నుండి భక్తులు తిరుమల పుణ్యక్షేత్రంకు వస్తుంటారు. ఇలా వచ్చిన భక్తులకు విఐపి బ్రేక్, ఆర్జిత సేవ, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షణ, వయోవృద్ధులు,దాతలు, సర్వదర్శనం టైం స్లాట్, దివ్యదర్శనం వంటి వివిధ పద్ధతుల ద్వారా టిటిడి స్వామి వారి దర్శనం కల్పిస్తూ ఉంటుంది.సామాన్య భక్తుల మొదలుకుని బడా రాజకీయ నాయకులు, బడా పారిశ్రామిక వేత్తల వరకూ శ్రీనివాసుడి క్షణకాలం పాటు జరిగే దివ్య మంగళ స్వరూపం కోసం పరితపించి పోతుంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తుంటారు.