బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్పై ప్రశంసలు కురిపించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు భారత్ తమకు అన్ని విధాలుగా సహకారం అందించిందని కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షేక్ హసీనా..నాలుగోసారీ అధికారంలోకి రానున్నారు.. ఈ సమయంలోనే ఆమె భారత్ గురించి సానుకూలంగా మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది.భారత్తో మైత్రి కొనసాగించేందుకు తాము ఎప్పటికీ సిద్ధంగానే ఉంటామన్న సంకేతాలిచ్చారు.ఈ సందర్భంగా భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.