loader

సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ఇస్రో ప్రయోగించిన వ్యోమనౌక ఆదిత్య ఎల్ 1 కీలక దశలోకి ప్రవేశించింది. దాదాపు 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత తుది దశలోకి ఎంటరైంది. భూమికీ, సూర్యుడికీ మధ్యన ఉన్న లాగ్రేంజ్ పాయింట్ లోకి ఈ నౌకను పంపడం ఇప్పుడు మిగిలి ఉంది.అయితే అంతకంటే ముందే దీని వృత్తాకార కక్ష్యలోకి ఆదిత్య ఎల్ 1ను పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. అత్యంత కీలకమైన ఈ ప్రక్రియకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది.

© Copyright 2022 Newz Blog. All Right Reserved