loader

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపూర్ లో ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమానికి ఏఐసీసీ చీప్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ ముఖ్య నేతలు, కాంగ్రెస్ రాష్ట్ర పాలిత సీఎంలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.ఈ యాత్రను మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కాగా.. ఏపీ నుంచి రఘువీరారెడ్డి, వైఎస్ షర్మిల హాజరయ్యారు.ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్ సభ నియోజవర్గాల మీదుగా కొనసాగనుంది. దాదాపు 67 రోజులపాటు 6 వేల 713 కిలోమీటర్లు రాహుల్ గాంధీ యాత్ర కొనసాగనుంది.

© Copyright 2022 Newz Blog. All Right Reserved