పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి ఊరటనిచ్చింది సుప్రీంకోర్టు. అంతకు ముందు సూరత్ కోర్టు రాహుల్ని దోషిగా తేల్చగా…ఈ తీర్పుపై స్టే విధించింది. ఈ తీర్పుతో కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోంది. సత్యమే గెలిచింది అంటూ రాహుల్కి మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఈ తీర్పు రాహుల్ గాంధీ స్పందించారు. ఆసక్తికర ట్వీట్ చేశారు. తన దారిలో ఏది అడ్డొచ్చినా పట్టించుకోనని తేల్చి చెప్పారు.
“నా దారిలో ఏదైనా రానివ్వండి. నా విధి మాత్రం ఒక్కటే. ఇండియాను రక్షించడం. ఆ ఐడియాలజీని కాపాడడం”
- 0 Comments
- vijayawada