చిరంజీవి కోసం గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం : దిల్ రాజు
భారత ప్రభుత్వం చిరంజీవికి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ పద్మ విభూషణ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనకు పద్మ భూషణ్ వరించగా.. లేటెస్ట్గా పద్మ విభూషణ్ అవార్డ్ వరించింది. సినీరంగానికి చేసిన సేవతో పాటు ఆ మధ్య కరోనా సమయంలో.. లాక్డౌన్ రావడంతో సినీ కార్మికులను, సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్తో సత్కరించింది. నిర్మాత దిల్ రాజు కూడా ప్రత్యేకంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. […]