సాగరతీరాన.. అంబరమంత అంబేడ్కరుడు..
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమున్నత శిఖరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్మృతివనం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్పై బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని ఎన్టీఆర్ గార్డెన్స్ను ఆనుకొని ఉన్న 36 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది.