భారత్పై ప్రశంస వర్షం కురిపించారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మెనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ. భారతదేశంపై తనకు అపారమైన నమ్మకం ఉండేందుకు గల నాలుగు కారణాలను వివరించారు.
ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లఖ్నవూలో జరుగుతున్న యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 ఆరంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు ముకేశ్ అంబానీ. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2023-24 పునాదులు వేసిందన్నారు.భారత్ బలమైన వృద్ధి బాటలో పయనిస్తోందని బలంగా విశ్వసిస్తున్నానన్నారు. భారత పౌరులు వేగంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారని కొనియాడారు.
భారత దేశ ఆర్థిక పునాదుల్ని ప్రపంచంలోని ఎవరూ ప్రశ్నించలేరని పేర్కొన్నారు.