ఆంధ్రప్రదేశ్ (లో ఎన్నికల పోరు మొదలైంది. ప్రధాన పార్టీలు బహిరంగ సభల ద్వారా ప్రజల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రాబోయే ఎన్నికల్లో అధికారమే పరమావధిగా ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలతో ఎండగడుతున్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదలిరా సభ నిర్వహించారు. భారీగా వచ్చిన టీడీపీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. జగన్ ప్రజాకోర్టులో శిక్షపడే సమయం వచ్చిందని..కౌంట్ డౌన్ మొదలైందన్నారు.
- 0 Comments
- guntur