పల్నాడు జిల్లాలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితులను అదుపు చేసేందుకు కేంద్ర బలగాలను మోహరించారు. దాడులు, ప్రతిదాడులతో పల్నాడు జిల్లా అట్టుడుకుతోంది. పోలింగ్ ముగిసినా…పల్నాడు జిల్లాలో కక్షలు చల్లారలేదు. పోలింగ్ సందర్భంగ తలెత్తిన విబేధాలు, ఘర్షణలు మరుసటి రోజూ కొనసాగాయి. కారంపూడి, పిడుగురాళ్ల, గురజాల, సత్తెనపల్లిలో ఘర్షణలో నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. గుంపులుగా బయట తిరిగినా…రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడినా అరెస్ట్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు..