loader

దగ్గర పడుతున్న కౌంటింగ్.. యాక్టివ్ మోడ్‌లోకి చంద్రబాబు.. ఎల్లుండి పవన్‌తో భేటీ

మే 31వ తేదీన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కూడా జరగనుంది. ఇద్దరు నేతలు పోలింగ్ జరిగిన తీరు, ఆ తర్వాత పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం . బీజేపీ నేతలు కూడా అదే రోజు చంద్రబాబును కలవనున్నట్లు సమాచారం. ఇక జూన్ ఒకటో తేదీ జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు తెలుగుదేశం పార్టీ శిక్షణ ఇవ్వనుంది. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా జూన్ మూడో తేదీన పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నట్లు తెలిసింది. మే 31వ […]

ఏపీలో ముగిసిన పోలింగ్.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. 6 గంటలతో ముగిసింది. అయితే చివరి గంటలో పోలింగ్ పర్సంటేజ్ భారీగా పెరిగింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. అటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఇవాళే పోలింగ్ జరిగింది. ఏపీలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాలైన […]

కేవలం రూ.300.. హైదరాబాద్ లోని పర్యాటక ప్రదేశాలను మొత్తం చుట్టేయొచ్చు..

ఒక్క రోజులోనే హైదరాబాద్ అంతా చుట్టేయడానికి తెలంగాణ టూరిజం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. హైదరాబాద్‌లోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని కల్పించింది. ఇందులో సాలార్‌జంగ్‌ మ్యూజియం, పురాని హవేలి, గోల్కోండ ఫోర్ట్‌, కుతుబ్ షాహి టూంబ్స్, లుంబిని పార్క్‌, బిర్లామందిర్‌, చౌమహల్లా ప్యాలెస్, ఛార్మినార్‌, మక్కా మజిద్‌, వంటివి కవర్‌ కవర్‌ అవుతాయి.

జనసంద్రమైన మేడారం.. గద్దెపై కొలుదీరనున్న అమ్మవార్లు..

ఆసియా ఖండంలో జరిగే అతి పెద్ద ఆదివాసి మహా సమ్మేళనం సమ్మక్క -సారలమ్మ జాతర. దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు.. కోటి మందికి పైగానే భక్తులు వస్తారు. 1996లో ఈ జాతరను అప్పటి ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించగా..తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మేడారం జాతర కు ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. ఫిబ్రవరి 21న బుధవారం.. కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు. అదే రోజు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి గ్రామం […]

సాగరతీరాన.. అంబరమంత అంబేడ్కరుడు..

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ సమున్నత శిఖరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్మృతివనం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్‌పై బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని ఎన్టీఆర్ గార్డెన్స్‌ను ఆనుకొని ఉన్న 36 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది.

ఇది ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన దేశం.. కాలుష్యం చాలా తక్కువ..!

ఈ ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ ప్రతిచోటా కాలుష్యం ఉంది.కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి దేశమూ ప్రణాళికలు వేస్తుంది. ఇందులో కాలుష్య రహిత దేశం మొదటి స్థానంలో డెన్మార్క్ ఉంది. పర్యావరణ విషయాలలో డెన్మార్క్ ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది.

నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం..

నూతన పార్లమెంట్‌లోని లోక్‌సభ భవనాన్ని జాతీయ పక్షి.. నెమలి థీమ్‌పై, రాజ్యసభను జాతీయ పుష్పం కమలం థీమ్‌పై రూపొందించారు.కొత్త లోక్‌సభ భవనం 888 సీట్ల సామర్థ్యం కలిగి ఉంది. కొత్త రాజ్యసభ హాలు సామర్థ్యాన్ని 384కి పెంచారు. రూ.20 వేల కోట్ల వ్యయంతో కొత్త పార్లమెంట్. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ దక్కించుకున్న టాటా.  రూ.75 నాణెం విడుదల చేయనున్న కేంద్రం

T20 World Cup 2024 టోర్నమెంట్: ఏకంగా 20 జట్లు పోటీ

ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోండటమే దీనికి కారణం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఓ టోర్నమెంట్‌లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడటం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. అన్ని ప్రధాన జట్లతో పాటు కొత్తగా అర్హత సాధించిన పలు టీమ్స్‌.. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ 20 జట్లను కూడా నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో అయిదు జట్లు ఉంటాయి. ఈ రెండు గ్రూపుల్లో టాప్‌లో […]

పల్నాడులో ఉద్రిక్తత పరిస్థితులు, 144 సెక్షన్ అమలు

పల్నాడు జిల్లాలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితులను అదుపు చేసేందుకు కేంద్ర బలగాలను మోహరించారు. దాడులు, ప్రతిదాడులతో పల్నాడు జిల్లా అట్టుడుకుతోంది. పోలింగ్ ముగిసినా…పల్నాడు జిల్లాలో కక్షలు చల్లారలేదు. పోలింగ్ సందర్భంగ తలెత్తిన విబేధాలు, ఘర్షణలు మరుసటి రోజూ కొనసాగాయి. కారంపూడి, పిడుగురాళ్ల, గురజాల, సత్తెనపల్లిలో ఘర్షణలో నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. గుంపులుగా బయట తిరిగినా…రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడినా అరెస్ట్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు..

© Copyright 2022 Newz Blog. All Right Reserved