జీ20 సదస్సు కోసం దేశ రాజధాని ఢిల్లీ సరికొత్తగా మెరిసిపోతోంది. కలర్ఫుల్ లైట్లు, త్రీడీ ప్రదర్శనలు, వివిధ దేశాల జెండాలు, స్వాగత తోరణాలు.. అబ్బో.. ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఢిల్లీ సరికొత్తగా కనిపిస్తోంది.ఈ ప్రగతి మండపం కేవలం సదస్సు కోసమే కాదు.. ఇది ఇండియా గొప్పదనాన్ని వివరిస్తుంది.ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో నూతనంగా నిర్మించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఉన్న భారత్ మండపంలో సెప్టెంబర్ 9, 10 తేదీలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ మండపాన్ని లైటింగ్స్, పెయింటింగ్స్తో అలంకరించారు. మండప గేట్ దగ్గర నటరాజ విగ్రహం ఆకట్టుకుంటోంది.