ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోండటమే దీనికి కారణం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఓ టోర్నమెంట్లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడటం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు.
అన్ని ప్రధాన జట్లతో పాటు కొత్తగా అర్హత సాధించిన పలు టీమ్స్.. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ 20 జట్లను కూడా నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్లో అయిదు జట్లు ఉంటాయి. ఈ రెండు గ్రూపుల్లో టాప్లో నిలిచిన నాలుగు జట్లు సెమీ ఫైనల్స్కు క్వాలిఫై అవుతాయి. సెమీస్ గెలిచిన రెండు జట్లు ఫైనల్స్లో తలపడతాయి.