సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్తో చేయనున్నారు. ఈ సినిమా ఆమధ్య హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఫస్ట్ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఈ సినిమా షూటింగ్కు బ్రేకులు పడ్డాయి. తాజాగా మహేష్ బాబు మళ్లీ షూటింగ్లో జాయిన్ అయ్యినట్టు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు.