తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఇవాళ ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. 9.30 గంటలకు తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరి తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారి పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకున్నారు.రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె.. తొలిసారి తిరుమలకు చేరుకున్నారు. మొదటగా శ్రీవారి ఆలయం వద్ద ఉన్న శ్రీ భూ వరహస్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.